ఈనెలలో బంగ్లాదేశ్తో జరగనున్న సిరీస్కు శ్రీలంక వన్డే క్రికెట్ జట్టు నూతన కెప్టెన్గా వికెట్ కీపర్- బ్యాట్స్మన్ కుశాల్ పెరీరా నియమితులయ్యాడు. లంక వైస్కెప్టెన్గా కుశాల్ మెండీస్ ఎంపికయ్యాడు. 101 వన్డేలు, 22 టెస్టులు, 47 టీ20ల్లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన పెరీరా..సీనియర్ ప్లేయర్ దిముత్ కరుణరత్నె నుంచి జట్టు పగ్గాలు చేపట్టాడు. కరుణరత్నెతో పాటు సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ లాహిరు తిరుమనె, వికెట్ కీపర్ దినేశ్ చండీమల్లను శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ జట్టు నుంచి తప్పించింది.
లంక టీమ్ మే 16న బంగ్లాకు బయల్దేరి వెళ్లనుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మే 23, 25, 28 తేదీల్లో ఢాకా వేదికగా జరగనుంది. జూలైలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమ్ఇండియా.. శ్రీలంక టూర్కు వెళ్లనుంది.