నంది పంప్హౌస్లో ఒక మోటర్ ప్రారంభం
ధర్మారం/రామడుగు, మార్చి 29: కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2లో మళ్లీ ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు మూడు నెలల తర్వాత జల సవ్వడులు కనిపిస్తున్నా యి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండో విడుత నీటి తరలింపు ప్రక్రియను అధికారులు ఆదివారం ఉదయం మొదలు పెట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ఆరో ప్యాకేజీలో భాగంగా నందిపంప్హౌస్లో ఒక మోటర్ ప్రారంభించారు. డెలివరీ సిస్టర్న్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీరు బయటకు వచ్చి లీడ్ చానల్ ద్వారా నంది రిజర్వాయర్లోకి చేరుతున్నది. ఇక్కడి నుంచి అంతే పరిమాణంలో ఏడో ప్యాకేజీ అండర్ టన్నెల్ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయ త్రి పంప్హౌస్కు వెళ్తున్నది. ఇక్కడి ఐదో మో టర్ను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. ఈ నీరు గ్రావిటీ కాలువ ద్వారా సుమారు 5.7 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీరాములపల్లి శివారులోని వరద కాలువకు చేరుతున్నది. అక్కడినుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి నీరు వెళ్తున్నది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 0.35టీఎంసీల నీరు ఎస్సారార్కు చేరిందని అధికారులు తెలిపారు.