హైదరాబాద్ : బ్లాక్లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న రెండు ముఠాలను పేట్బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి(ఔట్సోర్సింగ్), బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను మరో ముగ్గురితో కలిసి విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అపోలోలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది.. 2 బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ రెండు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.