న్యూఢిల్లీ: నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. ఢిల్లీలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన భారీ వర్షం కురుస్తుండటంతో విమానాన్ని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జైపూర్ ఎయిర్పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానంలోని 163 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లేందుకు అప్రూవల్ ఎప్పుడు వస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు. అంతేగాక ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన విస్తారా విమానాన్ని కూడా బ్యాడ్ వెదర్ కారణంగా జైపూర్కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.