జీఎం చింతల శ్రీనివాస్
సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం
మందమర్రి రూరల్, ఏప్రిల్ 2 : ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఈపీ ఆపరేటర్ల ఎంపిక ఉంటుందని జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల నుంచి ఈపీ ఆపరేటర్ల కోసం 206 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వీరికి మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో ఉదయం 5 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ను మూసివేయనున్నట్లు, ఉదయం పూట గ్రౌండ్కు వచ్చే వారు గమనించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్వోటూ జీఎం రామ్మోహన్, ఏరియా ఇంజినీర్ జగన్మోహన్రావు, పీఎం వరప్రసాద్, డీజీఎం వర్క్ షాప్, నరసింహరాజు, డీవైపీఎం శ్యామ్ సుందర్, సివిల్ ఈఈ జయప్రకాశ్, సీనియర్ పీవో సత్యబోసు, ఎస్ఈ ప్రభాకర్, ఎస్అండ్పీసీ ఎస్ఎస్వో రవి పాల్గొన్నారు.