ఫిలిప్పీన్స్లో భూకంపం:రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు

మనీలా: ఫిలిప్పైన్స్ లోని దక్షిణ ప్రాంతంలో గురువారం రాత్రి శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.0గా రికార్డయింది. ఎటువంటి ఆస్తినష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా జియలాజికల్ సర్వే కథనం ప్రకారం మిండానావో దీవిలోని ఆగ్నేయ నగరం దవావో సిటీకి 310 కి.మీ. దూరంలో 95 కి.మీ లోతున భూకంప కేంద్రం కేంద్రీక్రుతమైంది.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.23 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. దీని ప్రభావంతో జోస్ అబాద్ శాంతోస్ సిటీలో 15 నిమిషాల సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికులు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని స్థానిక పోలీస్ చీఫ్ కెప్టెన్ గ్లాబ్య్నారీ మురిల్లో చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఐపీఎల్ నుంచి ముంబై ఔట్.. హైదరాబాద్ ఇన్!
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
- 65 ఏళ్లు దాటిన వారికి కోవీషీల్డ్.. ఆమోదించిన ఫ్రాన్స్
- కరోనాతో ఖండ్వ ఎంపీ మృతి
- మీడియాపై కస్సుబుస్సుమంటున్న సురేఖ వాణి కూతురు
- రాజ్యసభ, లోక్సభ టీవీలు.. ఇక నుంచి సన్సద్ టీవీ
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్