హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి
చింతలపాలెం, మార్చి 28 : తెలంగాణలో అంతరిస్తున్న కళలు, సంప్రదాయాలకు జీవం పోసింది సీఎం కేసీఆరేనని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రేబల్లెలో వేంకటేశ్వర, చంద్రమౌళీశ్వర స్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెలుగు రాష్ర్టాల స్థాయి ఎడ్ల పందేలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా ఐకమత్యంతో బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రకళ, ఎంపీటీసీ సైదిరెడ్డి, నాయకులు చల్లా శేఖర్రెడ్డి, నర్సింహారావు, పప్పుజాన్, పేతురు పాల్గొన్నారు.
దొండపహాడ్లో : మండల పరిధిలోని దొండపహాడ్ గ్రామంలో తిరుపతమ్మ అమ్మవారి 18వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న కల్యాణ మహోత్సవాల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మేళ్లచెర్వు : మండల కేంద్రంతోపాటు వేపలమాధవరంలో లక్ష్మీతిరుపతమ్మ-గోపయ్యస్వామి కల్యాణోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ రూరల్ : మండలంలోని గోపాలపురంలో లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్యస్వామి జాతర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్ నాగసైదులు, ఎంపీటీసీ చీకూరి రాజారావు, హుస్సేన్మియా, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.
మునగాల : మండలంలోని విజయరాఘవాపురం తిరుపతమ్మ ఆలయంలో లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్య కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రభ బండ్ల ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : తొగర్రాయిలోని వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం, గరుడముద్దల కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీనరసింహారావు, స్వప్న, పృథ్వీలక్ష్మీహరిణి, లక్ష్మీనరసింహశాస్త్రి, అర్చకులు దోరెపల్లి సూర్యనారాయణశర్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా మాస కల్యాణం
మునగాల : కాముడి పౌర్ణమి సందర్భంగా మండంలోని బరాఖత్గూడెం వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మాస కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో కామిశెట్టి శ్రీనివాస్రావు, అర్చకుడు కందాళ శ్రీనివాసాచార్యులు, మాజీ సర్పంచ్ నరాల రుక్కారావు, వెంకటేశ్వర్రావు, సతీశ్, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.