International
- Dec 16, 2020 , 07:39:47
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం

మనీలా: ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. మిండనావు ప్రాంతంలో ఇవాళ తెల్లవారు జామున భూమి కంపించింది. దీని తీవ్రత 6.3గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. ఇవాళ ఉదయం 4.52 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. కాగా, భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో సెంట్రల్ ఫిలిప్పీన్స్లో సంభవించిన భూకంపం వల్ల ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. భారీగా ఆస్తినష్టం జరిగింది.
తాజావార్తలు
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
- అత్యద్భుత సిరీస్ విజయాల్లో ఇదీ ఒకటి: సచిన్
- టీమిండియా విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు
- రకుల్ జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
- రిషబ్ పంత్ సూపర్ షో..
- ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా
- కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి
- ఖుషీ కపూర్ ఎంట్రీపై బోనీ కపూర్ క్లారిటీ..!
- తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ
- నేతాజీ జయంతి ఇక పరాక్రమ్ దివస్
MOST READ
TRENDING