హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా షాద్నగర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంపై ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. ఇప్పటికే షాద్నగర్కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేశామన్నారు. దీని నిర్మాణం పూర్తయ్యే దశలో ఉందని, ప్రహరీ గోడను మే చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
123 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ల్యాబ్లు, లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. షాద్నగర్ డిగ్రీ కాలేజీ పనులు గతేడాది చేయలేదు.. త్వరలోనే అధికారులను పంపి రివ్యూ చేస్తామన్నారు. త్వరలోనే వీటి పనులు పూర్తి చేసి అప్పగిస్తామని మంత్రి సబిత తెలిపారు.