పుణె: ఇంగ్లాండ్తో మూడో వన్డేలో టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుత ఫీల్డింగ్ విన్యాసం ఆకట్టుకుంది. భువనేశ్వర్ కుమార్ వేసిన 31వ ఓవర్లో హార్దిక్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. మూడో బంతిని మొయిన్ అలీ(29) షాట్ ఆడగా హార్దిక్ ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి క్యాచ్ పట్టేశాడు. దీంతో దూకుడుగా ఆడుతున్న మొయిన్ అలీ పెవిలియన్ చేరాడు. 33 ఓవర్లకు ఇంగ్లాండ్ 7 వికెట్లకు 214 పరుగులు చేసింది. ప్రస్తుతం రషీద్(5), శామ్ కరన్(18) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 116 రన్స్ చేయాల్సి ఉంది.