బీజింగ్: చైనాలో వరుసగా భూకంపాలు వస్తున్నాయి. జాంగుయ్ టౌన్షిప్, షాచే కౌంటీలో శనివారం ఉదయం 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. తాజాగా యెచెంగ్ కౌంటీలో ఆదివారం తెల్లవారుజామున 1.52 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదయిందని చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ (సీఈఎన్సీ) తెలిపింది.
శనివారం ఉదయం 6.58 గంటలకు జాంగుయ్ టౌన్షిప్లో 4.6 తీవ్రతతో, ఉదయం 7.24 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించింది.