ముంబై: దేశమంతటా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. మహరాష్ట్రలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. అందులోనూ రాజధాని ముంబైలో అయితే రోజురోజుకు కొత్త కేసులు అంతకంతకే పెరిగిపోతున్నాయి. అయినా ముంబై వాసుల్లో కొందరు కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మాస్కులు ధరంచకుండా, సామాజిక దూరం పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ కరోనా నిబంధనలు పాటించాలంటూ నగర ప్రజలను ప్రాధేయపడ్డారు. మీకు దండం పెడుతా అందరూ మాస్కులు ధరించండి అంటూ విజ్ఞప్తి చేశారు. సింగిల్ మాస్కు కాకుండా డబుల్ మాస్కు ధరించాలని సూచించారు. ఎంతో అత్యవసరమైన పని ఉంటే తప్ప జనం ఎవరూ రోడ్లపైకి రాకూడదని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పోలీస్ అధికారికే రూ.97 వేలు టోకరా.. నైజీరియన్ అరెస్ట్
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ