ఎమ్మెల్సీ కవిత సారథ్యంలో
కార్మికుల సంక్షేమానికి పాటుపడుతాం
టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్రెడ్డి
తెలంగాణ చౌక్, ఏప్రిల్ 11: టీఎస్ ఆర్టీ సీ టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన అశ్వత్థామరెడ్డి బీజేపీ ముసుగులో ఆర్టీసీ కార్మికులను మోసం చేశాడని టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.థామస్రెడ్డి విమర్శించారు. టీఎంయూ కరీంనగర్ రీజియన్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో అదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా థామస్రెడ్డి పాల్గొన్నారు. ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. అశ్వత్థామరెడ్డి సమ్మె కాలంలో స్వార్థ ప్రయోజనాల కోసం ఏక పక్ష నిర్ణయాలను తీసుకున్నాడని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించి సంస్థ మనుగడను అస్థిర పరిచాడని ధ్వజమెత్తారు. కార్మికులను నుంచి వ్యతిరేకత రావడంతో పదవికి రాజీనామా చేశాడని తెలిపారు. ఇక నుంచి టీఎంయూకు అశ్వత్థామరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకుల చేతిలో పావుగా మారి సంస్థ భవిష్యత్ను ఆందోళనకరంగా మార్చాడని విమర్శించారు. ప్రభుత్వ మద్దతు లేనిది సంస్థ కొనసాగడం కష్టమని భావించి సీఎం కేసీఆర్కు సమస్యలను విన్నవించామని తెలిపారు.
స్పందించిన సీఎం సంస్థ మనుగడ కోసం, సిబ్బంది జీతభత్యాల కోసం రూ.500 కోట్లను కేటాయించారని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా బడ్జెట్లో రూ.3వేల కోట్లను కేటాయించారని వెల్లడించారు. సంస్థ అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. టీఎంయూకు ఎమ్మెల్సీ కవితక్క సారథ్యం వహిస్తుందని, ఇకనుంచి ఆమె నాయకత్వంలో టీఎంయూ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు. కార్మికులకు త్వరలోనే పీఆర్సీ వస్తుందని, టీఎస్ ఆర్టీసీకి పునర్వైభవం తెచ్చేందుకు కలిసి కట్టుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులమంతా టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతుగా ఉండి, కేసీఆర్కు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్గౌడ్, సలహాదారుడు యాదయ్య, సంయుక్త కార్యదర్శి నరేందర్, కార్యదర్శి సుచరిత, జోనల్ అధ్యక్షుడు రవీందర్, కరీంనగర్ రీజినల్ కార్యదర్శి ఎంపీ రెడ్డి, ప్రచార కార్యదర్శి మనోహర్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సన్రైజర్స్కు షాక్..10 పరుగులకే రెండు వికెట్లు