క్విటో: జైలులో రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. బాంబులు, తుపాకులతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దీంతో 24 మంది ఖైదీలు మృతిచెందారు. ఈక్వెడార్లోని గుయాక్విల్ జైలులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 24 మంది ఖైదీలు మృతి చెందారు. మరో 48 మందికిపైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
రంగంలోకి దిగిన సైనికులు, పోలీసులు అల్లర్లను అదుపు చేయడానికి 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. కాగా, ఈక్వెడార్లోని మూడు జైళ్లలో గత ఫిబ్రవరిలో జరిగిన ఘర్షనల్లో 79 మంది మరణించారు. జూలైలో జరిగిన మరో ఘటనలో 22 మంది ఖైదీలు మృతిచెందారు.