బీజింగ్: చైనాలోని జిన్జియాంగ్ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 21 మంది మైనర్లు గల్లంతయ్యారు. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్లో శనివారం సాయంత్రం భారీ వరదలు సంభవించాయి. దీంతో చాంగ్జీ హుయ్ అటానమస్ ప్రిఫెక్చర్లోని హుతుబి కౌంటీలో ఉన్న బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో గనిలో 29 మంది మైనర్లు పనిచేస్తున్నారని ప్రభుత్వ వార్తా సంస్థ చైనా డైలీ వెల్లడించింది. వారిలో 8 మందిని రక్షించారని, మరో 21 మంది మైనర్ల జాడ తెలియడం లేదని తెలిపింది. కనిపించకుండా పోయినవారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..