కాచిగూడ,మార్చి 27: తెలంగాణ చేనేత వస్త్రాలకు దేశ, విదేశాల్లో అధిక డిమాండ్ ఉందని, ప్రభుత్వం చేనేత కార్మిలకు చేయూతానందిస్తుందని చేనేత, జౌళిశాఖ కమిషనర్ రామయ్యార్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని యాదాద్రి భవన్లో తెలంగాణ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్,టెక్స్టైల్స్ అప్పెరల్ ఆధ్వర్యంలో శనివారం స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో-2021, చేనేత వస్త్రాలయాన్ని చేనేత, జౌళిశాఖ కమిషనర్ రామయ్యార్ ప్రారంభించారు. ఈ చేనేత వస్ర్తాలయం ఈనెల 27 నుంచి ఏప్రిల్ 9 వరకు 50 స్టాల్స్తో కొనసాగుతుందన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండే వివిధ రకాల చేనేత వస్త్రాలలు ఉన్నాయి. కార్యక్రమంలో చేనేత, జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం, ఓఎస్డీ రతన్కుమార్, ఏడీ ఇందిరా, డీఓ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.