కనోష్ : ఇసుక తుఫాన్ చెలరేగడంతో పది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన అమెరికాలోని ఉతా జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. ఉతా హైవే పెట్రోలింగ్ సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో దాదాపు 20 వాహనాలు ధ్వంసమైనట్లు పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని తరలించేందుకు హెలీకాప్టర్లను సిద్ధం చేశారు. రోడ్డుపై వాహనాలు ధ్వంసమై చెల్లాచెదురుగా పడివున్నాయి. అందిన సమాచారం ప్రకారం ఇసుక తుఫాన్ గంటకు 51 మైళ్ల వేగంతో ఉన్నది. కనోష్ నగరానికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. కనోష్ నగరం సాల్ట్ లేక్ సిటీకి దక్షిణాన 160 మైళ్ళు (258 కిమీ) దూరంలో ఉన్నది.
ఉతా జాతీయ రహదారిపై ఒక్కసారిగా ప్రారంభమైన ఇసుక తుఫాన్ కారణంగా బలమైన గాలులు వీచాయి. దుమ్ము, ఇసుక పైకి లేచి వాహనదారులపైకి ఎగిసిపడటంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. అయితే, ప్రమాదం ఫొటోలను చూస్తే గాయపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ జాతీయ రహదారిని ఆదివారం అర్థరాత్రి పాక్షికంగా మూసివేశారు. ప్రమాద స్థలం చుట్టూ ట్రాఫిక్ను మరొక మార్గం ద్వారా మళ్లించారు.
ఆఫ్ఘాన్లో 6 నెలల్లో 1659 మంది మృతి : యూఎన్ నివేదిక
సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా యువతను తీర్చిదిద్దాలి : వెంకయ్య
రూ.4,450 కోట్ల నష్టాల్లో టాటా మోటార్స్
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నుంచి ఒలింపిక్స్ మెడల్స్
రెండు కంపెనీల మధ్య టెక్నాలజీ వివాదం
ఈ నెల 31 న భారత్-చైనా మధ్య 12వ రౌండ్ చర్చలు
నార్వేలో జోరుగా ఉల్కాపాతం.. వెబ్ కెమెరాలో రికార్డ్
కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి నివాళి
చరిత్రలో ఈ రోజు.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..