ఆదిలాబాద్ రూరల్, మార్చి 23: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చూపిన తెగువను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ మరిచిపోరని, అందుకే 30శాతం ఫిట్మెంట్ను ప్రకటించారని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషే కం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ఉద్యోగుల పక్షానే ఉంటూ వారి కష్టాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారన్నారు. ఇటీవలే రాష్ట్రంలోని వివిధ శాఖ ల్లో పదోన్నతులు కల్పించారని గుర్తు చేశారు. దాంతో పాటు పీఆర్సీ కమిటీతో సంబంధం లేకుండా ఫిట్మెంట్ను 30శాతం ప్రకటించి ఉద్యోగులకు వేతనా లు పెంచారన్నారు. కేవలం ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యో గ, ఉపాధ్యాయులకే కాకుండా ఆశవర్కర్లు, కాంట్రా క్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ను ప్రకటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నా రు. చిన్నచిన్న వేతనాలతో పనిచేసే ఉద్యోగులకు ఈ ఫిట్మెంట్ ఎంతో లాభంగా ఉంటుందన్నారు. ఫిట్మెంట్ అందుకున్న ఉద్యోగులు కష్టపడి పనిచేసి రా ష్ర్టానికి మరింత పేరు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఉ ద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాల్గొన్నారు.