న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంలో 20 లక్షల మంది నీట మునిగి చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రసూతి సమస్యలు లేక పోషకాహారలోపం వల్ల మరణాల కంటే ఈ సంఖ్య ఎక్కువని పేర్కొన్నది. జూలై 25న తొలిసారిగా ప్రపంచ జలమృత్యు నివారణ దినం నిర్వహిస్తున్న సందర్భంగా శనివారం సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా కనీసం 2,36,000 మంది నీట మునిగి చనిపోతున్నారని తెలిపింది. ముఖ్యంగా పిల్లలు, యువకుల మరణాలకు దారితీసే పది ప్రధాన కారణాల్లో మునక ఒకటని పేర్కొన్నది.