ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మొహర్రం ఉరేగింపు సందర్భంగా బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడేండ్ల బాలిక, 20 ఏండ్ల వ్యక్తి ఉన్నట్లు పాక్ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి సీరియస్గా ఉందన్నారు. లాహోర్కు సుమారు 260 కిలోమీటర్ల దూరంలోని బహవల్ నగర్లో గురువారం ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు.
షియాల మొహర్రం ఊరేగింపు ఇమాంబర్గాకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి గ్రెనేడ్లు విరిసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అనుమానితుడ్ని వెంటనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. భారీగా భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఘటన జరిగిందన్నారు. మరోవైపు పేలుడు అనంతరం ప్రజలు భయాందోళనతో పరుగులు తీస్తున్న దృశ్యాలు, గాయపడిన వారిని అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.