బీజింగ్: చైనాలోని గ్వాంగ్జీలో దారుణం జరిగింది. గ్వాంగ్జీలో రీజియన్లో ఉన్న ఓ కిండర్గార్టెన్పై దుండగుడు దాడిచేసి ఇద్దరు చిన్నారులను పొట్టనపెట్టుకున్నాడు. మరో 16 మందిని తీవ్రంగా గాయపరిచాడని ప్రభుత్వ అధికార వార్త సంస్థ గ్జిన్హువా వెల్లడించింది. గ్వాంగ్జీలోని బిలీయు సిటీలో ఉన్న కిండర్గార్టెన్లోకి బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దుండగుడు చొరబడ్డాడని, ఇద్దరు చిన్నారులను విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడని, మరో 16 మందిపై దాడిచేశాడని తెలిపింది. దీంతో చిన్నారులు మరణించగా, గాయపడినవారు బిలియు సిటీ పీపుల్స్ హాస్పిటల్లో కోలుకున్నారని వెల్లడించింది. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..