International
- Jan 12, 2021 , 16:01:21
ఆమెకు ఇవాళే మరణశిక్ష.. స్టే ఇచ్చిన అమెరికా కోర్టు

కన్సాస్: అమెరికాకు చెందిన లీసా మాంట్గోమోరి అనే మహిళకు ఇవాళ మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఇండియానా జైలులో ఆమెకు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేయాలి. కానీ అమెరికా కోర్టు ఆమె మరణంపై 24 గంటల స్టే విధించింది. 2004లో ఓ గర్భిణిని చంపి.. ఆమె కడుపులో ఉన్న శిశువుతో లీసా పరారైంది. ఆ కేసులో దోషిగా తేలిన లీసాకు మరణశిక్ష ఖరారైంది. లీసా మానసిక ఆరోగ్యం సరిగా లేదని జడ్జి ప్యాట్రిక్ హన్లాన్ మరణ శిక్ష అమలును నిలిపివేశారు. గత 67 ఏళ్లలో ఓ మహిళకు ఖరారైన మరణశిక్షను ఆడ్డుకోవడం ఇదే తొలిసారి. హత్యకు గురైన గర్భిణికి పుట్టిన అమ్మాయి వయసు ఇప్పుడు 16 ఏళ్లు. విక్టోరియా జో అనే ఆ అమ్మాయి.. లీసా మరణశిక్ష అంశంపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు.
తాజావార్తలు
- గంగానది ప్రశాంతత మంత్రముగ్ధం : ఎమ్మెల్సీ కవిత
- 'విరాటపర్వం' విడుదల తేదీ ఖరారు
- పిల్లల డాక్టరైనా.. విచక్షణ కోల్పోయి..
- కొవిడ్ షాక్ : పసిడి డిమాండ్ భారీ పతనం
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ
- వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..
- ఆ తీర్పు ఇచ్చింది జస్టిస్ పుష్పా వీరేంద్ర.. ఎవరామె ?
MOST READ
TRENDING