ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 2 : జిల్లావ్యాప్తంగా గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు గుడ్ఫ్రైడే విశిష్టతను వివరించారు. మండలకేంద్రంలోని సెయింట్ ఆండ్రీవ్స్ చర్చిలో గుడ్ఫ్రైడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శిలువపైన ఏసుప్రభువు చనిపోయేముందు చెప్పిన మాటలను చర్చి ఫాదర్ రెవరెండ్ దేవవరం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడ్ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ఉపవాసదీక్ష పాటిస్తారని తెలిపారు. చర్చిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా భోజనం ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించామని పాస్టర్లు తెలిపారు. కార్యక్రమంలో పాస్టరేట్ సెక్రటరీ జయప్రసాద్, స్టువర్ట్ జాన్ బ్రహ్మయ్య, ట్రెజరర్ డాక్టర్ బి.జె. ఇమ్మానుయేల్, జయరాజ్, జె. రాజశేఖర్, మంత్రి సాల్మన్రాజ్, మెర్సీ మాలిని, జె.స్వామిదాస్, పి.స్వామిదాస్, రేవతి ఇమ్మానుయేల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యానగర్, ఏప్రిల్ 2 : జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఉన్న చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వేడుకలను నిర్వహించారు. పాస్టర్ ఏసు బైబిల్లోని పలు అంశాలపై బోధనలు చేశారు. కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దోమకొండ, ఏప్రిల్ 2 : మండలంలోని దోమకొండ, సంగమేశ్వర్ గ్రామాల్లోని బెతెల్ ఆశ్రమంతోపాటు గుడ్ ఫ్రూట్ మినిస్ట్రీస్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రూట్ మినిస్ట్రీస్ చర్చి పాస్టర్ సాప శ్రీను క్రీస్తు బోధలు చేశారు.
ఇవీ కూడా చదవండి..
మాతో పెట్టుకుంటే.. నాలుగేండ్లూ నిద్రపోనివ్వం!
మెర్కెల్ అనుభవం ప్రపంచానికి గుణపాఠం : మిషెల్ ఒబామా
చేతులు, కాళ్లతో క్యూబిక్ గేమ్.. గిన్నిస్లోకి ఎనిమిదేండ్ల బాలుడు
మీకు దేశాన్ని పాలించడం రాదు : సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు