న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో కరోనా వైరస్ బారిన పడిన టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా మహమ్మారి నుంచి కోలుకున్నాడు. వచ్చే నెలలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు అతడు అందుబాటులో ఉండనున్నాడు. లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన సాహాకు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే.