పసర: శ్రీలంకలో బస్సు లోయలో పడింది. ఆ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించారు. మరో 31 మంది గాయపడ్డారు. పసార వద్ద ఉన్న మోనెరగాలా-బదుల్లా రోడ్డు దగ్గర ఇవాళ ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మీద నుంచి పక్కకు ఉన్న లోయలో బస్సు పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. గాయపడ్డవారిని సమీప హాస్పిటల్లో చేర్పించారు.