గార్ల, ఏప్రిల్ 19 : రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏఎంసీ, తిరుపతమ్మ దేవాలయ సమీపంలో పీఏసీఎస్ల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఇల్లం దు వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ బీ హరిసింగ్నాయక్తో కలిసి ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలో ఈ ఏడాది సుమారు 5 వేల ఎకరాల్లో వరి ధాన్యం పండించారన్నారు. కాగా, ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రంలో రెం డు, సత్యనారాయణపురంలో ఒకటి, సీతంపేటలో ఒకటి, పుల్లూరులో ఒకటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ వీ దుర్గాప్రసాద్, ఎంపీపీ ఎం శివాజీ, జడ్పీటీసీ జే ఝాన్సీలక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, తహసీల్దార్ కే స్వాతిబిందు, డిఫ్యూటీ తహసీల్దార్ సయ్యద్ రఫీయొద్దీన్, ఏవో కే రామారావు, సీఈవో వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
బయ్యారం: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధ్యాన్యం కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులను రాజులా చూడాలనే లక్ష్యం తో ముందుకు సాగుతూ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో కూ డా రైతులు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వమే రైతుల ధ్యాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ చైర్మన్ హర్సింగ్ నాయక్, ఎంపీపీ మౌనిక, వైస్ ఎంపీపీ గణేశ్, సొసైటీ చెర్మన్ మూల మధుకర్రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ. సర్పంచ్ కోటమ్మ, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీవో చలపతిరావు, రైతు బంధు సమితి కోర్డీ నేటర్ సోమిరెడ్డి, ఎంపీటీసీ శైలజారెడ్డ్డి, డైరెక్టర్లు ప్రభాకర్రెడ్డి, సీతరాంరెడ్డి, మల్లయ్య, నాయకులు శ్రీకాంత్, ఐలయ్య, సోందు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.