బీజింగ్: చైనాలో భారీ గ్యాస్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హుబీ ప్రావిన్స్ షియాన్ నగరంలోని జాంగ్వాన్ జిల్లాలో ఆదివారం ఉదయం 6.30 గంటలకు గ్యాస్ పేలుడు సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది 150 మందిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన 39 మందిని ఆసుపత్రులకు తరలించారు. నివాసిత ప్రాంతంలో జరిగిన గ్యాస్ పేలుడు తీవ్రతకు పలు ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదని ఆ దేశ అధికారులు వెల్లడించారు.