ముంబై : మహారాష్ర్ట రాజధాని ముంబైలోని భాందుప్ ప్రాంతంలో ఉన్న డ్రీమ్స్ మాల్ భవనంలోని సన్రైజ్ ఆస్పత్రిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆస్పత్రిలో నిన్న సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు డీసీపీ ప్రశాంత్ కదమ్ వెల్లడించారు.
అగ్నిప్రమాదంలో గాయపడ్డ బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, అగ్నిప్రమాదం కారణంగా రోగులు మరణించలేదని సన్రైజ్ దవాఖాన వర్గాలు తెలిపాయి. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారిని వేరే దవాఖానలకు తరలిస్తున్న సమయంలో రోగులు మరణించారని పేర్కొన్నాయి.
బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: ఠాక్రే
అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా స్థలిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శుక్రవారం సందర్శించారు. బాధిత కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి