అన్ని రాష్ర్టాలకు మనమే స్ఫూర్తి
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
60 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులంతా అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన 60 మంది అభ్యర్థులకు గురువారం సైఫాబాద్లోని రవీంద్రభారతిలో నియామక పత్రాలను అందజేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారంతా సంస్థ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. చాలారంగాల్లో తెలంగాణ ప్రగతిపథాన సాగుతున్నదని, అన్ని రాష్ట్రాలు మనల్ని చూసి నేర్చుకుంటున్నాయని చెప్పారు.
ఉద్యోగులుగా ఉన్నప్పుడు తామంతా సెంట్రల్ స్కేల్ కావాలంటూ కొట్లాడేవాళ్లమని, మోదీ సర్కారు 14.5 శాతం ఫిట్మెంట్ను ప్రకటిస్తే కేసీఆర్ సర్కారు సెంట్రల్ స్కేల్ను మించి 73 శాతం ఫిట్మెంట్ను అమలుచేస్తున్నదని తెలిపారు. బేవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు రవీంద్రభారతి వేదికగా నియామక ఉత్తర్వులు అందుకోవడం చారిత్రాత్మకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అధికారులు అజయ్రావు, రాంసింగ్, హరికిషన్, సంతోష్రెడ్డి, అబ్రహం పాల్గొన్నారు.