కైరో, జూలై 9: ఆకలిని భరించలేక ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ఆక్స్ఫామ్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇది కరోనా మరణాల కంటే ఎక్కువని తెలిపింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి చూస్తే వైరస్ కారణంగా నిమిషానికి సగటున ఏడుగురు చనిపోయినట్టు వెల్లడించింది. ‘హంగర్ వైరస్ మల్టిైప్లెస్’ పేరుతో ఆక్స్ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది.15.5 కోట్ల మంది ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపింది.