అచ్చంపేట రూరల్ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సలేశ్వరం జాతరను రద్దు చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సలేశ్వరం జాతర ఉత్సవాలను ఈ ఏడాది నిలిపి వేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26, 27న ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉన్నా.. కొవిడ్ నేపథ్యంలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.