జెనీవా: ప్రతి దేశంలో జనాభాలో 10 శాతం మందికి కొవిడ్-19 టీకాలు వేసేలా ప్రపంచవ్యాప్త కృషి జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సోమవారం పిలుపునిచ్చారు. యూఎన్ హెల్త్ ఏజెన్సీ ప్రధాన వార్షిక అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రతి దేశ జనాభాలో కనీసం 10 శాతం మందికి సెప్టెంబరు నాటికి వ్యాక్సిన్ పూర్తిచేయాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.