ఘట్కేసర్,అక్టోబర్ 26 : ఘట్కేసర్ మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ 3వ వార్డు ఎన్ఎఫ్సీనగర్లో టీఆర్ఎస్ నాయకుడు బొక్క ప్రభాకర్ రెడ్డి సొంత డబ్బులతో తయారు చేయించిన నార సంచులను మంగళవారం ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా నార సంచులను వాడాలని సూచించారు. వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం కేసీఆర్ హరితహారం ఉద్యమాన్ని చేపట్టారని, ఇందులో భాగంగా కోట్లాది మొక్కలు నాటామని తెలిపారు.
ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడమే ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత బ్యాగులను అందుబాటులోకి తీసుకువస్తేనే ఇది సాధ్యమన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ సంగీతా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలను నిర్వహించడం మంచి పరిణామమన్నారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీకి ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపాల సుధాకర్రెడ్డి, మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కుమార్, ప్రజలు పాల్గొన్నారు.