కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 25 : కూకట్పల్లి జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన థీమ్ పార్కు పనులను వేగవంతం చేయాలని జడ్సీ మమత అన్నారు. సోమవారం జోన్ ఆఫీస్లో ఇంజినీరింగ్, ఉద్యానవన శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సీ మమత మాట్లాడుతూ.. ఆయా సర్కిళ్ల పరిధిలో చేపట్టిన బతుకమ్మ, ఎనర్జీ, జంగిల్ బుక్, జిమ్, ఎన్విరాల్మెంటల్, స్పోర్ట్స్ థీమ్ పార్కు పనులను వేగవంతం చేయాలన్నారు. థీమ్ పార్కుల్లో అసంపూర్తి పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. సంబంధిత అధికారులతో సర్కిళ్ల వారీగా సమావేశాలు నిర్వహించి థీమ్ పార్కు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సర్కిళ్ల వారీగా సమావేశం నిర్వహించి మూసాపేట తరహాలో ప్రతీ సర్కిల్లో అన్నపూర్ణ క్యాంటీన్లను తీర్చిదిద్దాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీటి నాలాలకు సంబంధించి సమీక్షలు నిర్వహించి ప్రమాదాలు, నాలా ఆక్రమణలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈలు గోవర్దన్ గౌడ్, కె.వి.ఎస్.ఎన్.రాజు, బయో అర్బన్ డైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి, మేనేజర్లు, ఏఎంసీ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.