అబిడ్స్, ఆగస్టు 12 : స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ హైదరాబాద్ జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ మామిడి భీంరెడ్డి, సంఘటన్ అధికారి ఖష్త్ పేర్కొన్నారు. రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. మాసాబ్ట్యాంక్లోని రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన క్యాంప్ నిర్వహిస్తామని వివరించారు.
కరోనా సంక్షభ సమయంలో రక్తం నిల్వలు ఎంతో అవసరమని, అదే విధంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా రక్తం అవసరమన్నారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు.