హైదరాబాద్: పాతబస్తీలోని డబీర్పురా ఘర్షణలో గాయపడిన యువకుడు మృతిచెందాడు. చంచల్గూడా జైలు సమీపంలోని వీధుల్లో నిన్న అర్ధరాత్రి కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఓ చిన్న వివాదంతో మొదలైన ఘర్షణ పెద్దదిగా మారింది. దీంతో యువకులు ఒకరిపైఒకరు విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దుకున్నారు.
అజీబ్, ముజీబ్, కమ్రాన్తో పాటు మరికొంత మంది చేసిన దాడిలో అద్నాన్, అతడి గ్యాంగ్ తీవ్రంగా గాయపడ్డారు. దెబ్బల ధాటికి అద్నాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడు.