హైదరాబాద్: కరోనా సమయంలో ప్రజల అవసరాలను పలువురు ఆదాయ వనురుగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా, బ్లాక్ఫంగస్తో ఇబ్బంది పడుతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్ చేస్తూ వారి సంబంధీకులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇలాంటివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో బ్లాక్ఫంగస్ ఇంజక్షన్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సరూర్నగర్లో ఇంజక్షన్లను అమ్ముతుండగా పట్టుకున్నారు. నిందితుడు కూకట్పల్లి ప్రగతినగర్కు చెందిన గంగొళ్ల మనీశ్గా గుర్తించారు. ఒక్కో ఇంజక్షన్ను రూ.35 వేలకు అమ్ముతున్నాడని తెలిపారు. అతనిపై కేసు నమోదుచేసి, ఇంజక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను ఆరాతీస్తున్నారు.