సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ) : యవ్వన ప్రాయం..ఏదైనా చేయగలమనే మనస్తత్వం..ఆపై దూకుడు..చివరకు ఓ నిండుప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ విషాద ఘటన ఈనెల 7వ తేదీన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద జరగగా.. ఏడు కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. కాగా.. వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన యువకుడు (17) ఇంటర్ పూర్తి చేశాడు. ఈనెల 30న పుట్టినరోజు ఉంది. ముందే దోస్తులకు ధావత్ ఇవ్వాలని భావించి ప్రాంతం కోసం వెతికాడు. వికారాబాద్లోని వాటర్ఫాల్స్ వద్ద పార్టీ చేసుకుందామని ఈనెల 7వ తేదీ తెల్లవారుజామున ఆరుగురితో కలిసి కారులో బయల్దేరాడు. లాక్డౌన్ కారణంగా వాటర్ ఫాల్స్ మూసి ఉండడంతో గూగుల్లో శోధించి జహీరాబాద్లో మరో వాటర్ఫాల్స్ ఉన్నట్లు తెలుసుకొని వెళ్లారు. అక్కడ నీళ్లల్లో ఎంజాయ్ చేసి తిరిగి బయల్దేరుదామని అనుకుంటుండగా పుట్టినరోజు జరుపుకోబోయే యువకుడు చివరిసారి అంటూ నీళ్లల్లోకి దూకాడు. అంతే తిరిగి బయటకు రాకపోవడంతో కంగారుపడిన స్నేహితులు ఇంట్లో కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అప్పటికే పుట్టినరోజు జరుపుకోవాల్సిన యువకుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన మృతుడి కుటుంబంతోపాటు ఆరుగురు యువకుల కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. వీరంతా ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వారు.
పాఠశాల దశ దాటిన తర్వాత పిల్లల ప్రవర్తనలో విపరీత మార్పు వస్తుంది. పెద్దయ్యామనే భావనతోపాటు మాకు అన్నీ తెలుసులే.. అన్న స్వభావంతో వ్యవహరిస్తారు. ఈ దూకుడును తగ్గించగలిగితే పిల్లలను జాగ్రత్తగా ఉంచవచ్చు. బాధ్యత మరిచి ఈ ఏడు కుటుంబాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం వల్ల వచ్చే లాభామూ ఉండదు. పిల్లల సంరక్షణకు ఇలా చేయండి..