మహబూబాబాద్ : ప్రేమించిన వాడు మోసం చేశాడని ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన జిల్లాలోని బయ్యారం మండలం సాంబ తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బయ్యారం మండలం సాంబ తండాకు చెందిన ధర్మసోత్ సునీత (24), బీఈడీ చదువుకుంది. అదే గ్రామానికి చెందిన శివ ఇద్దరు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే బీఈడీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు. బీఈడీ పూర్తి చేసిన తర్వాతనే పెద్దలకు చెప్పాలని నిర్ణయించారు. కాగా, బీఈడీ పూర్తి చేసిన సునీత ఇంటికి వచ్చి ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పింది.
సునీతను పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని శివ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించాడు. వీరి ప్రేమ విషయాన్ని స్థానిక సర్పంచ్ రమేష్ కు చెబుదామని సునీత తండ్రి బిచ్య సర్పంచ్ ఇంటికి వెళ్తుండగా.. శివతో పాటు వారి కుటుంబ సభ్యులు అడ్డగించి తీవ్రంగా గాయపరిచారు. దీంతో వెంటనే దవాఖానకు తరలించి, బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు శివపై కేసు పెట్టకుండా మద్దతుగా నిలిచారని సునీత సూసైడ్ నోట్లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రేమ వ్యవహారం తేల్చమని చెప్పిన వినకుండా పోలీసులు, శివ తల్లిదండ్రులు మా నాన్న పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు.
దీంతో మనోవేదన చెందిన సునీత శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్
తాండూరులో కొవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించిన మంత్రి
తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాతి : మంత్రి సత్యవతి రాథోడ్