టిక్టాక్లో పరిచయం అయ్యాడు.. కాలేజీకి వెళ్లి స్నేహితుడయ్యాడు.. సెల్ఫీలు దిగాడు.. ఆ తర్వాత ప్రేమిస్తున్నానన్నాడు.. దీన్ని ఆ యువతి తిరస్కరించడంతో ఆమెపై కో పం పెంచుకున్నాడు. తన వద్ద ఉన్న ఫొటోలతో బెదిరింపులకు దిగాడు.. భయాందోళనకు గురైన బాధిత యువతి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లికి చెందిన కొమ్మగోని కల్యాణ్ గౌడ్ ఓ కారు వాషింగ్ సెంటర్లో పని చేస్తున్నాడు. టిక్టాక్లో ఓ యువతిని రెగ్యులర్గా ఫాలో అ య్యాడు. ఇద్దరు తమ ఫోన్ నంబర్లు తీసుకుని.. వాట్సాప్ చాటింగ్ చేశారు. ఆ తర్వాత యువతి కాలేజీ వద్దకు వెళ్లి స్నే హం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సెల్ఫీలు దిగారు. చివరకు ఓ రోజు ప్రేమిస్తున్నానని చెప్పాడు.
ఈ ప్రతిపాదనను ఆ యువతి తిరస్కరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. మరొకరితో వివాహం జరుగుతుందని తెలుసుకుని ఆ యువతిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. భయాందోళన చెందిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడు కల్యాణ్ గౌడ్ను అరెస్ట్ చేశారు.