అబిడ్స్/రవీంద్రభారతి,జూలై 21: గొల్ల,కురుమల అభివృద్ధ్ది ప్రదాత సీఎం కేసీఆర్ అని, వారి సంక్షేం కోసం రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.11వేల కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు,ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ముస్లిం జంగ్ఫూల్ వంతెన వద్ద ఉన్న కురుమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ, శ్రీనివాసులు,ఉపాధ్యక్షుడు కన్నా, నర్సింహ,కోశాధికారి మల్లేశం,కె శ్రీనివాసులు,యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్తో కలిసి క్షీరాభిషేకం చేశారు. యావత్ కురుమల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నగర ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్,ప్రకాశ్,మల్లేశం, అమర్నాథ్,కె విమల్ కుమార్,కె వివేకానంద తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్క్లబ్ ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి సంఘం నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అశోక్ కుమార్ యాదవ్,బోడుప్పల్ కార్పొరేటర్ వెంకటేశ్ యాదవ్,మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.