సైదాబాద్ : ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో సైదాబాద్ లోకాయుక్త కాలనీలో జరిగిన ఈ కార్య క్రమానికి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ మూలంగా రాష్ట్రంలో గిరిజనులకు వైద్యం అందకపోవటంతో రోగాల బారిన పడి చాలమంది ఇబ్బందులు పడుతున్నారని, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గిరిజన సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం హైదరాబాద్ కార్యదర్శి ఎం. బాలు నాయక్, జిల్లా నాయకులు శేఖర్ నాయక్, పాండు నాయక్, శ్రీనునాయక్, రవి నాయక్, సుమన్ రాథోడ్, నీలా బాయి, కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.