హైదరాబాద్ : నగర శివార్లలోని మేడిపల్లి చెరువులో సోమవారం ఉదయం ఓ మహిళా మృతదేహం లభ్యమైంది. మార్నింగ్ వాక్కు వెళ్లిన కొందరు చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
అయితే మేడిపల్లి పరిధిలోని బుద్ధనగర్కు చెందిన 50 ఏండ్ల మహిళ రెండు రోజుల క్రితం అదృశ్యమైనట్లు పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈమె ఆమెనే అయి ఉండొచ్చు అనే అనుమానంతో పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ మహిళ తమ కుటుంబానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.