హయత్నగర్, ఆగస్టు 19 : నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను అతివేగం దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామం శాంతినగర్కు చెందిన చింతకుంట్ల ఈదమ్మ(50), వృత్తిరీత్యా గృహిణి. గురువారం మధ్యాహ్నం పెద్దఅంబర్పేట చౌరస్తాలో ఓ షాపు వద్దకు ఈదమ్మ నడుచుకుంటూ వెళ్తుంది.
అదే సమయంలో అతివేగం దూసుకొచ్చిన కారు నెం.(టీఎస్ 07 జిఎల్ 0214) ఈదమ్మను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుమారుడు పరుశురాం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.