కాచిగూడ,ఆగస్టు 31 : తల్లి, కొడుకు గొడవపడి తల్లి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ డివిజన్లోని చెప్పల్బజార్ ప్రాంతానికి చెందిన రమేశ్ భార్య గనన సుమిత్ర(52)ఈ నెల 28వ తేదీన ఉదయం తల్లి, కొడుకు గొడవపడ్డారు.
దీంతో మనస్థాపం చెందిన తల్లి సుమిత్ర కుటుంభ సభ్యులకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లి ఇప్పటికి తిరిగి రాకపోవడంతో కలత చెందిన భర్త ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కొడుకు దీపక్ సోమవారం రాత్రి కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంట్లోంచి సుమిత్ర వెళ్లే సమయంలో నీలి రంగు చీర, గొధుమ రంగు జాకెట్ ధరించి, ఎత్తు 5.3 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.