హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి బట్టలు కొనడానికి వెళ్లిన యువతి కానరాని లోకాలకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన యువతి భవనం పెచ్చులూడి తలపై పడటంతో మృతిచెందింది. మంగళవారం సాయంత్రం ఓ యువతి కూకట్పల్లిలోని వాణిజ్య సముదాయం మొదటి అంతస్తులో ఉన్న బొటిక్కు వెళ్లింది. కొత్త బట్టలు తీసుకునేందుకు బొటిక్ వెలుపల నిల్చున్నది. అదే సమయంలో మూడో అంతస్తు నుంచి పెచ్చులూడి ఆ యువతి తలపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని దవాఖానకు తరలించారు.