హైదరాబాద్ : సాఫ్రాన్ ఎలక్ట్రికల్, పవర్ సంస్థ ప్రతినిధుల బృందం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
సఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ సంస్థ 2018లో హైదరాబాద్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది.
ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ (ఎఫ్ఏడీఏసీ) అండ్ రాఫెల్ కార్యకలాపాల్లో వినియోగించే లీప్ఇంజిన్లు, ఏరో ఇంజిన్ వైర్ పట్టీలు, అంతర్గత అనుసంధాన వ్యవస్థలను ఈ సంస్థ తయారు చేస్తుంది.
2021 చివరినాటికి హైదరాబాద్లో తాము విస్తరించిన ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ల సౌకర్యాన్ని ప్రారంభించాలని సఫ్రాన్ యోచిస్తున్నది.
మంత్రి కేటీఆర్ను కలిసిన వారిలో సాఫాన్ సంస్థ ఇండియా చైర్మన్ రోస్ మక్ఇన్నెస్తోపాటు ఎండీ పియరీ డికేలీ, అంతర్జాతీయ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ జిగ్లేర్ ఉన్నారు.