కోల్కతా: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కోల్కతాలోని తన ఇంట్లో స్పెషల్ కేక్ కట్ చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా క్రికెట్, యూరో, కోపా అమెరికా ఫుట్బాల్, ఒలింపిక్స్కు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కరోనా కారణంగా తన బర్త్డేను ఇంట్లోనే సింపుల్గా జరుపుకున్నట్లు దాదా చెప్పారు. 55 ఏళ్ల తర్వాత యూరోలో ఇంగ్లండ్ ఫైనల్కు వచ్చిందని, తనకు సంతోషంగా ఉందని అన్నారు. ఇక కోపా అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. తన సపోర్ట్ ఎప్పుడూ బ్రెజిల్కే ఉంటుందని గంగూలీ అన్నారు. ఒలింపిక్స్కు వెళ్తున్న ఇండియన్ టీమ్ ఈసారి చాలా మెడల్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు.