శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కొండాపూర్ శిల్పాగార్డెన్లో గురువారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పర్యటించారు. కాలనీలో స్థానికంగా కొనసాగుతున్న భూగర్బ డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిల్పాగార్డెన్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ నిర్మాణ పనులను సైతం వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెవాలని సంబందిత అధికారులకు తెలిపారు. పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యతతో ఎక్కడ రాజీ పడోద్దని సూచించారు.
ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం జరుగుతుందని, తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ ప్రాదాన్యత క్రమంలో పరిష్కారం చేపట్టడం జరుగుతుందన్నారు. డ్రైనేజీ, రోడ్లు, మంజీరా, విద్యుత్ లాంటి మౌళిక వసతులను కల్పించేందుకు అహర్నిశలు పాటుపడుతున్నానని పేర్కొన్నారు.
శిల్పాగార్డెన్ కాలనీ అభివృద్దికి కృషిచేస్తానన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ రమేష్, ఏఈ సునీల్, శిల్పాగార్డెన్ వాసులు రామకిశోర్, అపూర్వ, శ్రీవాత్సవ, రాజశేఖర్, సందీప్, శ్రావణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.