మణికొండ, ఏప్రిల్ 17 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం, పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిదద్ధేందుకు టీఆర్ఎస్ సర్కారు ప్రతిషష్ఠాత్మకంగా తడి-పొడి చెత్త డంపింగ్యార్డుల ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది. పారిశుధ్య సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు సాగుతుంది. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు పెద్దపీట వేస్తూనే గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ప్రతి వాడను అందంగా మార్చేందుకు సెగ్రిగేషన్ షేడ్ల నిర్మాణానికి ప్రభు త్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. మొదటి విడుతగా పల్లె ప్రగతిలోనే సర్కారు ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థల సేకరణలో ఆలస్యం కావడంతో రెండో విడుతలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా పట్టణ ప్రగతిలోనూ మున్సిపాలిటీలలో సెగ్రిగేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా మహమ్మారి విజృంభణతో గతేడాది రెండు మాసాల పాటు అభివృద్ది పనుల్లో కొంతమేర ఆలస్యం జరిగినా ఇప్పుడు రెట్టింపు స్థాయిలో అసంపూర్తి పనులను పూర్తి చేసింది.
మున్సిపాలిటీల్లోని వాడవాడల్లో తడి-పొడి చెత్త వేరు చేసేందుకు ఇప్పటికే ఇంటింటా బుట్టలు పంపిణీ చేసి చెత్త సేకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే కొన్ని వార్డులకు సంబంధించిన చెత్తను డంపింగ్ చేసే ప్రాంతాల ఎంపికపై ఆలస్యం జరిగింది. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా డీఆర్సీసీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మణికొండ మున్సిపాలిటీ సెగ్రిగేషన్ కేంద్రంలో చెత్త డంపింగ్ చేసి తడి-పొడి చెత్తలను వేర్వురు చేసి జవహార్నగర్కు తరలిస్తున్నారు.
ఆయా డంపింగ్ యార్డులోనూ ఇష్టానుసారంగా చెత్తను వేయకుండా ప్రభుత్వం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. డంపింగ్ యార్డులతో పాటు సెగ్రిగేషన్ షేడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని పక్షంలో గ్రామకంఠాల నుంచి కొనుగోలు చేయాలని సర్కారు సూచించింది. విచ్చలవిడిగా చెత్తను పోసి పరిసరాలను అపరిశుభ్రంగా చేయకుండా ఉండటానికి సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇదిలావుండగా చాలా గ్రామాలు, పట్టణాలల్లో షేడ్ నిర్మాణాల కోసం స్థలాల పరిశీలన కొనసాగుతుంది.
శివారు మున్సిపాలిటీలైన మణికొండ, నార్సింగిలలో సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణాల కోసం స్థలాల అన్వేషణ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలల నుంచి గుర్తించి స్థలాల కేటాయింపు పనులు ఆగిపోయాయని, డంపింగ్యార్డులను చేపట్టిన అక్కడే ప్లాంట్ల నిర్మాణాల పనులను చేపట్టనున్నారు.